
మైనర్లకు లైంగిక వేధింపులు
తిరుత్తణి: మైనర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన ముగ్గురిపై పోలీసులు అరెస్టు చేశారు. తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఈనెల 11న ముళ్ల పొదల్లో పసికందును గుర్తించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందిన తరువాత తిరువళ్లూరులోని చిన్నారుల సంరక్షణ కేంద్రంకు తరలించారు. విచారణలో ఆర్కేపేట ప్రాంతానికి చెందిన ఓ టెన్త్ విద్యార్థిని ఆ పసికందును ముళ్ల పొదలో వేసినట్లు తేలింది. వంగనూరుకు చెందిన కరుణ (23) అనే యువకుడిని టెన్త్ విద్యార్ధిని ప్రేమించి గర్భందాల్చినట్లు, ప్రసవం కోసం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి వస్తే చిన్నారికి ప్రసవం చేయరని, పోలీసులు సమాచారం ఇస్తారని తెలియడంతో ఆసుపత్రికి సమీపంలో ఆడబిడ్డకు జన్మనిచ్చి ముళ్ల పొదల్లో వేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారిని గర్భవతి చేసిన కరుణను పోక్సో నేరం కింద అరెస్టు చేశారు. అలాగే తిరువలంగాడు ప్రాంతంకు చెందిన విద్యార్ధిని ప్లస్–2 చదువుకుంటున్నారు. ఆ విద్యార్ధినితో సరదాగా మాట్లాడుతూ యువకుడు లైంగిక వేదింపులకు పాల్పిడినట్లు బాలిక తిరుత్తణి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిందిత సీఐ మలర్ కేసు నమోదు చేసి ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన విజయ్(28)ను పోక్సో చట్టం ద్వారా అరెస్టు చేశారు.
నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడియత్నం
అలాగే తిరుత్తణికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి తనవెంట తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై లైంగిక దాడి యత్నించాడు. దీనిపై మహిళా పోలీసులు కేసు నమోదు చేసి మనోహరన్(59) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
● వేర్వేరు చోట్ల ముగ్గురిపై పోక్సో కేసు