
డీఎంకేతోలోనే విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కేవీ కుప్పంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భవనాలను రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో కేవీ కుప్పంలో మంత్రి దురైమురుగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని విద్యార్థులు గతంలో కళాశాల విద్య కోసం వేలూరు, గుడియాత్తం వెళ్లాల్సి ఉండేదని దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు కేవీ కుప్పంలో కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించడంతో ప్రభుత్వంతో అనుమతి పొంది ఈ ఏడాదే తరగతులు ప్రారంభించాలని పూర్తి చేశామన్నారు. ఈ చుట్టు పక్కల చాలా గ్రామాలే ఉన్నందున నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఇక్కడ విద్యను అభ్యసించేందుకు వస్తారన్నారు. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. అనంతరం విద్యార్థుల అడ్మిషన్లను ప్రారంభించారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎంపీ కదిర్ ఆనంద్, ఎమ్మెల్యేలు న ందకుమార్, కార్తికేయన్, అములు, జగన్మూర్తి, జెడీ చైర్మన్బాబు, విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ సింత్య సెల్వి, కేవీ కుప్పం యూనియన్ చైర్మన్ రవిచంద్రన్, వైస్ చైర్మన్ భారతి పాల్గొన్నారు.