
చెస్ పోటీలతో సృజనాత్మక ఆలోచనలు
కాట్పాడిలో ఎడపాడి పళణిస్వామి జన్మదినం
వేలూరు: చెస్ పోటీలు మానవుని మేధాశక్తిని పెంచుతాయని తిరుపత్తూరు జిల్లా అదనపు ఎస్పీ గోవిందరాజు అన్నారు. తిరుపత్తూరులోని ప్రైవేటు పాఠశాల ఆవరణంలో పైడ్ రేటడ్ చెస్ చాంపియన్షిప్–2025 పోటీలు తిరుపత్తూరు జిల్లా చెస్ అసోసియేషన్, తమిళనాడు చెస్ అసోసియేషన్, కాట్పాడి రాయ వేలూరు జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్తంగా విద్యార్థులకు జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు పాఠశాల విద్యార్థులు, పెద్దలకు వేర్వేరుగా నిర్వహించారు. వీటికి కాట్పాడి తాలుకా చెస్ అసోషియేషన్ కార్యదర్శి మనోహరన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు ఎస్పీ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. పాఠశాల విద్యార్థులు తరచూ ఇటువంటి చెస్ పోటీల్లో కలుసుకునే విధంగా తల్లిదండ్రులు పోత్సహించాలన్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ విద్యపై శ్రద్ధ వహిస్తున్నారని విద్యార్థులకు క్రీడలపై కూడా ఆశక్తి పెరిగే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాయ వేలూరు చెస్ అసోసియేషన్ సభ్యులు ఆనందబాబు, రాజశంకర్, చంద్రశేఖరన్, తమిళనాడు చెస్ అసోషియేషన్ ప్రదాన కార్యదర్శి స్టీబన్ బాలాస్వామి, జాయింట్ కార్యదర్శి రాజశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.
అశ్లీల ఫొటోలను చూపించి నగదు వసూలు
అన్నానగర్: చైన్నెలోని మదురవాయిల్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యాపారవేత్త. ఇతని భార్య, పిల్లలు కోయంబత్తూరులో నివసిస్తున్నారు. అతను ప్రతి వారం తన భార్య పిల్లలను చూడటానికి కోయంబత్తూరుకు వచ్చేవాడు. ఈ పరిస్థితిలో గత నెలలో అతని సెల్ఫోన్ నెంబర్కు యాప్ ద్వారా కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన మర్మమైన వ్యక్తి వ్యాపారవేత్తను తన భార్య, పిల్లలను చూడటానికి కోయంబత్తూరుకు రావద్దని, వస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో షాక్ అయిన వ్యాపారవేత్త కాల్ వచ్చిన నెంబర్ కోసం దర్యాప్తు చేశాడు. అందులో మిర్రాట్ యాప్ ద్వారా కాల్ చేసింది కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడని తెలిసింది. దీనికి సంబంధించి వ్యాపారవేత్త చైన్నె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ఇందులో నారాయణన్ పేరుతో ఒక సిమ్కార్డు తీసుకున్నారని, ఆ సిమ్ కార్డు స్వీట్ సన్ వ్యాపారవేత్తను బెదిరించడానికి ఉపయోగించాడని తేలింది. దీని తరువాత చైన్నె స్పెషల్ పోలీసులు రత్తినపురిలోని స్వీట్ సన్ ఇంటికి చేరుకుని అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు పోలీసులను చూసిన స్వీట్ సన్ ఇంటి కిటికీ పగులగొట్టి పారిపోయాడు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దీనిపై పోలీసులు మాట్లాడుతూ కోయంబత్తూరులోని రత్నపురానికి చెందిన స్వీట్ సన్ శరవణంపట్టి ప్రాంతంలోని ఒక ప్రైవేటు కళాశాలలో సంగీత విభాగంలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. అతను సింగనల్లూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్నప్పుడు చైన్నెకు చెందిన వ్యాపారవేత్త భార్యతో పరిచయం ఏర్పడింది. ఆ అలవాటును ఆసరగా చేసుకుని వ్యాపారవేత్త భార్యతో సన్నిహితంగా ఫొటోలు దిగాడు. తర్వాత స్వీట్ సన్ ఆమెకు అశ్లీల ఫొటోలను చూసించి డబ్బు, నగలు అడిగి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది.
వేలూరు: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఎడపాడి పళణిస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాట్పాడిలోని కాంగనెల్లూరు గ్రామంలోని ఆలయంలో కార్పొరేషన్ 10వ వార్డు కార్పొరేటర్ కేపీ రమేష్ అధ్యక్షతన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు, మాజీ జిల్లా కార్యదర్శి రాములు ముఖ్య అథిదిగా హాజరై ఆ ప్రాంతంలోని వల్లిదైవాని సమేత శ్రీసుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, దీపారాధన పూజలు చేశారు. అనంతరం ఎడపాడి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆలయం వెలుపుల భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంజీఆర్ మండ్రం జిల్లా కార్యదర్శి నారాయణన్, వండ్రంతాంగల్ సర్పంచ్ రాకేష్ రెడ్డి, సేన్బాక్కం మాజీ కార్పొరేటర్ మేగనాధన్, అమరనాద్, దాస్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చెస్ పోటీలతో సృజనాత్మక ఆలోచనలు