
తిరంగా ర్యాలీ
ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా
కొరుక్కుపేట: చైన్నెలోని కాశీమేడు ఫిషింగ్ హార్బర్ లో ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా బీజేపీ తిరంగా ర్యాలీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించింది. ఫిషింగ్ బోర్డు పార్కింగ్ ప్రాంతంలో ప డవలను తిరంగాలతో అలంకరించి మరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ ఈ తిరంగా కార్యక్రమం సముద్రంలోని పరిమిత ప్రాంతంలో జరిగింది. ఈ ర్యాలీని తమిళనాడు బీజేపీ రాష్ట్రకార్యదర్శి సతీష్ కు మార్ నిర్వహించారు. తమిళనాడు బీజేపీ మత్స్యకార విభాగం అధ్యక్షుడు మునుస్వామి, బీజేపీ జి ల్లా అధ్యక్షుడు నాగరాజు నాయకత్వం వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తమిళనాడు, క ర్ణాటక రాష్ట్రాల బీజేపీ జాతీయ సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా తమిళనాడు బీజేపీ రాష్ట్రఅధికార ప్రతినిధి ఎఎన్ఎస్ ప్ర సాద్, స్పోర్ట్స్ వింగ్ అధ్యక్షుడు అమర్ ప్రసాద్రెడ్డి, ఉత్తర చైన్నె తూర్పు జిల్లా అధ్యక్షుడు ఎన్ఎల్ నాగరాజ్తోపాటు స్థానిక ప్రజలు, మత్స్యకారులు పా ల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైతన్య వంతమైన నాయకత్వంలో భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రశంసించారు. తిరంగ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేశారు. సా యుధ దళాలు, కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు. ర్యాలీ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న మత్స్యకారులు, వారు కుటుంబాలతో కలసి ప్రధాని మోదీ ప్రసంగం విన్నారు. దేశ వారసత్వం, సంస్కృతి, ఐక్యతను ప్రోత్సహించడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.