
పేదలఊటీలో ఫ్లవర్ షో
సేలం: పర్యాటకులను ఆకర్షిచడంలోనూ, అందాలను విరబూయించడంలోనూ ఊటీని తలపించే ప్రదేశం ఏర్కాడు. ఇక్కడ ఫ్లవర్ షో మరింత వన్నె తెస్తోంది. శీతోష్ణస్థితులకు అనుగుణంగా వాతావరణాన్ని ఇట్టే అనునయించుకోగలిగి, ఊటీ అందాల్ని అచ్చంగా కళ్లకు కట్టినట్టు పేదల ముందు ఉంచిన సుందర ప్రదేశం ఈ ఏర్కాడు. సేలం నుంచి 30 కి. మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఏడాది పొడవున ఒకే రకంగా శీతోష్ట స్థితి ఉంటుంది. ఎతైన పర్వత శ్రేణులు, లోయలు, ఆహ్లాదాన్ని పంచే వాతావరణం, పలు రకా ల చెట్లతో సోయగాలు చిందించే ఈ ప్రాంతం అభివృద్ధికి 1820–1829 మధ్య కాలంలో అప్పటి సేలం జిల్లా కలెక్టర్గా ఉన్న సోటిష్ కృషి చేశారు. ఇక్కడి ప్రాధాన్యతను గుర్తించిన బ్రిటీషు గవర్నర్ థామస్ మురీ 1842లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించారు. ఇక్కడ కాఫీ. ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్ద బడ్డ బోట్ హౌస్, చిల్డన్స్, అన్నా ఉద్యనవన వనాలు ప్రత్యేక ఆకర్షణ. 36 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ సిద్ధం చేసిన బొటానికల్ గార్డెన్ను మరో ఆకర్షణ. ఇక్కడ గ్యాలరీ, లాన్, బటర్ప్లవర్ గార్డెన్, యూ టవర్, వ్యూ పాయింట్, విజిటర్స్ షెల్టర్, కృత్రిమ నీటి ధార, మ్యూజికల్ ఫౌంటేన్లు పర్యటకులకు కనువిందు. అలాగే ఇక్కడి యాకుర్డ్ సరస్సు, లేడీస్ సీట్, కిల్లీయూర్ ఫాల్స్, సిల్క్ ఫాం, రోస్ గార్డెన్లు చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ పర్వతంపై కొలువు దీరిన సేర్వరాయన్ ఆలయం ఆధ్యాత్మికతకు నెలవు. ఊటి సందర్శనకు వచ్చే వాళ్లు ఇక్కడకు తప్పకుండా వస్తుంటారు. అలాగే ఊటీకి వెళ్లలేని వాళ్లు అక్కడి అందాల్ని ఏర్కాడు రూపంలో చూసి తరిస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏటా వేసవి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
వేసవి ఉత్సవాల ఫ్లవర్ షో....
ఏర్కాడులో వేసవి ఉత్సవం పుష్ప ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈనెల 29వ తేదీ వరకు ఈ పుష్ప ప్రదర్శన జరగనుంది. సేలం జిల్లా కలెక్టర్ ఆర్ బృందా దేవి అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవానికి మంత్రులు ఎంఆర్కే పన్నీరు సెల్వం, రాజకన్నప్పన్, రాజేంద్రన్లు హాజరయ్యా రు. వ్యవసాయం, అటవీ, పర్యాటకం, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్, పట్టు అభివృద్ధి శాఖల సంయుక్త మిళితంగా ఈ ప్రదర్శన కొలువు దీరింది. ఏను గులు, అడవి గేదెలు, కుందేళ్ళు, కోతులు, పాములు, జింకలు , పులులు వంటి అడవి జంతువుల ఆకృతులను 50 వేల ఎరుపు, నారింజ, పసుపు , తెలుపు గులాబీలతో తీర్చిదిద్దారు. డెల్టా రైతుల వరప్రదాయిని మేట్టూరు జలాశయం తరహాలో ఆకృతిని తెలుపు, ఎరుపు,పసుపు వర్ణాలతో కూడిన 73 వేల గులాబీలతో రూపొందించారు. అంతే కాకుండా ఘన వ్యర్థాల నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి 5,640 తెలుపు, పసుపు ఎరుపు తదితర వర్ణాలతో గులాబీల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన జీవి అయిన ఒంటి కొమ్ము గుర్రం చిత్రాన్ని 7,000 గులాబీ రేకులతో తీర్చిదిద్దారు.
ప్రకృతి అందాల నడుమ ఏర్కాడు
పోటెత్తుతున్న పర్యాటకులు

పేదలఊటీలో ఫ్లవర్ షో

పేదలఊటీలో ఫ్లవర్ షో

పేదలఊటీలో ఫ్లవర్ షో

పేదలఊటీలో ఫ్లవర్ షో