
మంత్రి పొన్ముడి తీరును ఖండిస్తూ ధర్నా
వేలూరు: మహిళలను కించ పరిచే విధంగా అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి పొన్ముడిని ఖండిస్తూ వేలూరులోని అన్నారోడ్డులో అన్నాడీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ధర్నాకు మహిళా విభాగం జిల్లా కార్యదర్శి షీలారాజన్ అధ్యక్షత వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలో మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడటం సర్వ సాధారణంగా మారిందన్నారు. ఈ ధర్నాలో ఆ పార్టీ జిల్లా కోశాధికారి మూర్తి, మహిళా విభాగం జాయింట్ కార్యదర్శి ఉమ విజయకుమారి పాల్గొన్నారు.