
పొల్లాచ్చిలో దారుణం
అన్నానగర్: పొల్లాచ్చిలో మంగళవారం పట్టపగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. కోయంబత్తూరు జిల్లా, పొల్లాచ్చి సమీపంలోని వడుగపాళయంలోని పొన్ముత్తునగర్కు చెందిన కన్నన్. ఇతను కార్ వర్క్షాప్లో ఉద్యోగి. ఇతని భార్య వనిత. వీరికి అశ్విక (19) సహా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అశ్విక కోవైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదేవిధంగా పొల్లాచ్చి–ఉడుమలై రోడ్డులోని అన్నామలైకు చెందిన రాజన్ కుమారుడు ప్రవీణ్కుమార్ (23). ఇతను ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థలో ఉద్యోగి. ఈక్రమంలో అశ్విక, ప్రవీణ్కుమార్ ప్రేమించుకుంటున్నారు. అశ్విక కొన్ని రోజులుగా ప్రవీణ్కుమార్తో మాట్లాడడం మానేసిందని తెలిసింది. ఆగ్రహించిన ప్రవీణ్కుమార్ సోమవారం మధ్యాహ్నం అశ్విక ఒంటిరిగా ఉందని తెలిసి ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. గమనించిన ఇరుగుపొరుగు వెంటనే కుటుంబసభ్యులకు, పొల్లాచ్చి తాలూకా పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి రక్తపుమడుగులో పడివున్న అశ్వికను పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు గాలిస్తున్నారని తెలిసి ప్రవీణ్కుమార్ పొల్లాచ్చి సిటీ వెస్ట్ పోలీస్స్టేన్లో లొంగిపోయాడు. పోలీసుల విచారణలో అశ్విక మరొక స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఇది చూసిన ప్రవీణ్కుమార్ అశ్వికను ప్రశించాడు. దీంతో ఆమె ప్రవీణ్కుమార్తో మాట్లాడడం మానేసింది. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్కుమార్ అశ్వికను హతమార్చినట్లు తెలిసింది.