ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Apr 23 2025 7:52 AM | Updated on Apr 23 2025 8:39 AM

ౖసైనె

ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

సేలం: శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్రైవేటు సిద్ధ వైద్య కళాశాలలో సేలంకు చెందిన షీలారాణి మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమె ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా ౖసైనెడ్‌ను తయారు చేసే వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, తిన్నట్టు సమాచారం. కొంత సమయానికే స్పృహ తప్పిన ఆమెను సహ విద్యార్థినులు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే షీలారాణి మృతి చెందినట్టు స్పష్టం చేశారు.

కారు ఢీకొని వృద్ధురాలి మృతి

సేలం: అరియలూర్‌ జిల్లా విక్రమంగళం సమీపంలో ఉల్లియకుడి గ్రామానికి చెందిన సరోజ(80) తన ఇంటి ముందు నిలబడి ఉండగా అటువైపుగా వెళుతున్న కారు అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరోజ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. విక్రమంగళం పోలీసులు కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌ వెన్‌మన్‌ కొండాన్‌ ఉత్తర వీధికి చెందిన శరత్‌ కుమార్‌(25)ను అరెస్టు చేశారు.

సిసింగ్‌ రాజా అనుచరుల అరెస్టు

సేలం: తాంబరం సమీపంలో ఇరుంబులియూర్‌ ప్రాంతానికి చెందిన వివేక్‌రాజ్‌ (29)పై పలు నేరాలకు సంబంధించి పలు పోలీసు స్టేషన్‌లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సిసింగ్‌ రాజా అనుచరుడైన వివేక్‌రాజ్‌ తనను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారనే భయంతో గత కొంత కాలంగా పీర్కాంగరనై పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తర్వాత జామీన్‌పై బయటకు వచ్చిన వివేక్‌రాజ్‌ సేలయూర్‌ సమీపంలో దారి దోపిడీకి పాల్పడడంతో సోమవారం పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.

లారీ ఢీకొని విద్యార్థి దుర్మరణం

సేలం: బన్రుటి సమీపంలో ఉన్న తిరుత్తురైయూర్‌ ప్రాంతానికి చెందిన యువరాజ్‌(16) పుదుచ్చేరిలో ఉన్న కళాశాలలో డిప్లమో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తిరుత్తురైయూర్‌కు వచ్చిన యువరాజ్‌ సోమవారం సొంత పని నిమిత్తం బైక్‌పై బయటకు వెళ్లాడు. అప్పుడు అతను గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ వేగంగా బైక్‌ను ఢీకొంది. దీంతో దూరంగా విసిరిపడిన యువరాజ్‌ సంఘటనా స్థలంలోనే మరణించాడు. ఫిర్యాదు మేరకు పుదుపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఆటో సైడ్‌ మిర్రర్‌ పగిలి మహిళ మృతి

సేలం: మదురై మేలవాసాల్‌ ప్రాంతానికి చెందిన మారియమ్మాల్‌(36) సోమవారం సాయంత్రం షేర్‌ ఆటోలో మకపూప్పాలయం ప్రాంతానికి వెళ్లింది. అప్పుడు ఆమె ప్రయాణించిన ఆటోని మరొక ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో సైడ్‌ అద్దం పగిలి, దాని చుట్టు ఉన్న ఇనుప రేకు తెగి ఆటోలో ఉన్న మారియమ్మాల్‌ గొంతుకు కోసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన మారియమ్మాల్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది.

చెరువులో మునిగి మరణించిన వ్యక్తి

తిరువొత్తియూరు: చైన్నె, పల్లికరణై సాయిగణేష్‌ నగర్‌కు చెందిన గణేష్‌ బాబు(25) షోలింగనల్లూర్‌లో ఉన్న బైక్‌ షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతను పల్లికరణై చెరువులో స్నానం చేయడానికి స్నేహితులు సామువేలు, పుగలరసన్‌తో కలిసివెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా గణేష్‌ బాబు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. స్నేహితులు అతని కోసం గాలించారు. గణేష్‌ బాబు లోతైన ప్రాంతంలో నీటిలో మునిగినట్టు తెలిసింది. దిగ్భ్రాంతి చెందిన స్నేహితులు వేలచేరి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతని కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గణేష్‌ బాబు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్ష కోసం తరలించారు. దీనిపై పల్లికరణై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య 
1
1/3

ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య 
2
2/3

ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య 
3
3/3

ౖసైనెడ్‌ తిని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement