ఉదయం నుంచే బారులు | - | Sakshi
Sakshi News home page

ఉదయం నుంచే బారులు

Sep 10 2025 10:06 AM | Updated on Sep 10 2025 10:06 AM

ఉదయం నుంచే బారులు

ఉదయం నుంచే బారులు

ఉదయం నుంచే బారులు

నడిగూడెం : ఈ నెల 8న నడిగూడెం పీఏసీఎస్‌కు 444 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలిసిన రైతులు మంగళవారం తెల్లవారుజాము నుంచే రైతు వేదిక వద్ద చిట్టీల కోసం బారులుదీరారు. రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఒకటి చొప్పున, ఐదు ఎకరాల రైతులకు రెండు చొప్పున బస్తాలు పంపిణీ చేశారు. మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. కాగా నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు ఉలవల పద్మ ఉదయం ఏడు గంటలకే రైతు వేదిక వద్దకు వచ్చారు. మధ్యాహ్న భోజనం రైతు వేదిక వద్ద బయట తింటుండడంతో అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement