
ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ నియమితులయ్యారు. మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ను ఇటీవల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రిగా నియమించిన విషయం విదితమే. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డిలకు ఈ సారి ఇన్చార్జి మంత్రి బాధ్యతలు అప్పగించలేదు.