
15న ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీ ప్రమాణస్వీకారం
హుజూర్నగర్ : కోదాడలో ఈనెల 15న ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం హుజూర్నగర్ పట్టణంలోని కన్యకాపరమేశ్వరి భవన్లో ఆర్యవైశ్య మహాసభ పట్టణ, మండల సమావేశం నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా ఎన్నికై న పాలకవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు, సంఘం నాయకులు బి.రామారావు, వి.నరసింహా రావు, పి.లక్ష్మీనరసింహారావు, బి.రాజా, వి.నాగేశ్వరరావు, పి.అశోక్, జి.విద్యాసాగర్, ఇ.కోటేశ్వరరావు, డి.నరసింహమూర్తి, కె.పాపారావు, వి.వెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వర్లు, రామ్నరేష్, ఆంజనేయులు, నాగేశ్వరరావు, శ్రీమన్నారాయణ, నరసింహారావు అయ్యప్ప పాల్గొన్నారు.