
ఆపరేషన్ కగార్ పేరిట హత్యాకాండ
సూర్యాపేట అర్బన్ : కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట హత్యాకాండ సాగిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు వి. కోటేశ్వరరావు ఆరోపించారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట పట్టణంలో వాణిజ్య భవన్ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జగ్జీవన్రాం విగ్రహం వద్ద రాస్తారోకో చేస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకోబోయారు. ఈక్రమంలో వాగ్వాదం చేసుకొంది. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27మందిని ఎన్కౌంటర్ చేశారని, అది మరవక ముందే కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను కాల్చి చంపారని ఆరోపించారు. కార్యక్రమంలో మండారి డేవిడ్ కుమార్, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు, పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్, పోలేబోయిన కిరణ్, మధు, శ్రీను, నాగయ్య, నర్సిరెడ్డి పాల్గొన్నారు.