భూ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలు పరిష్కరించాలి

Jun 10 2025 3:14 AM | Updated on Jun 10 2025 3:14 AM

భూ సమస్యలు పరిష్కరించాలి

భూ సమస్యలు పరిష్కరించాలి

తిరుమలగిరి (తుంగతుర్తి) : రెవెన్యూ సదస్సుల్లో రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీసీఎల్‌ఏ సెక్రటరీ మంద మకరంద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుమలగిరిలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన విధంగా తగిన ఆధారాలతో రైతులు తమ దరఖాస్తులు సమర్పించి సహకరించాలని కోరారు. రైతులు సమర్పించిన దరఖాస్తులపై పూర్తి విచారణ చేసి నిబద్ధతకు అనుగుణంగా తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.హరిప్రసాద్‌, ఆర్‌ఐ జార్జిరెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ అనిత, అజయ్‌, చందు, వినోద్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

ఫ సీసీఎల్‌ఏ సెక్రటరీ మంద మకరంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement