
భూ సమస్యలు పరిష్కరించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : రెవెన్యూ సదస్సుల్లో రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీసీఎల్ఏ సెక్రటరీ మంద మకరంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుమలగిరిలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన విధంగా తగిన ఆధారాలతో రైతులు తమ దరఖాస్తులు సమర్పించి సహకరించాలని కోరారు. రైతులు సమర్పించిన దరఖాస్తులపై పూర్తి విచారణ చేసి నిబద్ధతకు అనుగుణంగా తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి.హరిప్రసాద్, ఆర్ఐ జార్జిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అనిత, అజయ్, చందు, వినోద్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఫ సీసీఎల్ఏ సెక్రటరీ మంద మకరంద్