లక్ష్యం చేరని ధాన్యం సేకరణ | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం చేరని ధాన్యం సేకరణ

Jun 8 2025 1:23 AM | Updated on Jun 8 2025 1:23 AM

లక్ష్యం చేరని ధాన్యం సేకరణ

లక్ష్యం చేరని ధాన్యం సేకరణ

నాగారం : యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణ పూర్తయింది. రైతుల నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ దాదాపు 3.40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనాల కంటే కొనుగోలు కేంద్రాలకు 10 వేల టన్నుల ధాన్యం తక్కువగా అమ్మకానికి వచ్చింది. దీంతో అధికారులు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని చేరలేకపోయారు.

339 కేంద్రాల ద్వారా సేకరణ

ఈ యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు 339 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 264 కేంద్రాల ద్వారా 2,89,150 మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని 75 కేంద్రాల ద్వారా 50,850 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం రూ.770 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా రైతులకు రూ.690 కోట్లు చెల్లించారు. సన్నధాన్యానికి చెంది క్వింటాల్‌కు రూ.500 చొప్పున రూ.25 కోట్ల బోనస్‌ చెల్లించనున్నారు. ఇప్పటి వరకు అన్ని కేంద్రాల్లో సేకరణ ముగియగా 54,648 మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించారు. ఈ సీజన్‌లో మే నెలలో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. వచ్చే సీజన్‌లో ధాన్యం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో

ఉంచేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఆలస్యమైన కొనుగోళ్లు

ఈ ఏడాది యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభం కాగా జూన్‌ మొదటి వారంలోపే పూర్తయ్యాయి. ఈ ఏడాది అకాల వర్షాలు, మిల్లులను తక్కువగా కేటాయించడం, లారీల కొరత తదితర కారణాలతో కొనుగోళ్లలో జాప్యం జరిగింది. దీనికితోడు గతేడాది జిల్లాలో 72 మిల్లులను కేటాయించగా.. ఈ ఏడాది కేవలం 34 మిల్లులే కేటాయించారు. సీఎంఆర్‌ సకాలంలో ఇవ్వకపోవడంతో కొన్ని మిల్లులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. దీంతో మిల్లుల సంఖ్య సగానికి తగ్గి కొనుగోళ్లు ఆసలస్యమయ్యాయి.

ఫ టార్గెట్‌ 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఫ కొన్నది 3.40 లక్షల మెట్రిక్‌ టన్నులే..

ఫ ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు

ధాన్యం కొనుగోళ్ల వివరాలు..

కొనుగోలు కేంద్రాలు 339

దొడ్డురకం ధాన్యం 2,89,150 మెట్రిక్‌ టన్నుల

సన్నరకం 50,850 మెట్రిక్‌ టన్నులు

దొడ్డు రకం అమ్మిన రైతుల సంఖ్య 47,382

సన్నరకం అమ్మిన రైతులు 7,266

రైతులకు చెల్లించిన డబ్బులు రూ.690కోట్లు

చెల్లించాల్సిన డబ్బులు రూ.80కోట్లు

3.40లక్షల మెట్రిక్‌ ధాన్యాన్ని సేకరించాం

ఈ ఏడాది యాసంగిలో రైతుల నుంచి 3.50లక్షల మెట్రిక్‌ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దీనిలో దొడ్డు, సన్నరకం ధాన్యాన్ని కలిపి 3.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ధాన్యం సేకరణలో కొంత ఇబ్బందులు ఎదురైనా అధిక మించి కొనుగోళ్లను పూర్తిచేశాం.

– ప్రసాద్‌, డీఎం, సివిల్‌సప్లయ్‌, సూర్యాపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement