
మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి
భానుపురి (సూర్యాపేట) : ఒక్కో ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ఒక్కో అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్గా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లోని తన చాంబర్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రెవేట్ ప్లే పాఠశాలలకు దీటుగా మార్చేందుకు ఒక్కో సెంటర్కు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఇంజనీర్ల ద్వారా అంచనా విలువలు తయారు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో పనులు చేపట్టాలని సూచించారు. బడిబాట కార్యక్రమంతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు ప్రీ స్కూల్లో చేరేలా ప్రచారం చేయాలన్నారు. ఇంటి స్థలం ఉన్న ట్రాన్స్జెండర్స్కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, అలాంటి వారిని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డి డబ్ల్యూఓ నరసింహారావు, సీడీపీఓలు రూప, శ్రీవాణి, శ్రీజ, పారిజాత, నిర్మల, కిరణ్మయి, సూపర్వైజర్లు చంద్రిక, అరుణ, సునీత, డీసీపీఓ రవి, మహిళా సాధికారత కోఆర్డినేటర్ చైతన్య, సఖి ఇన్చార్జి హేమలత, ఎఫ్ఆర్ఓ వినోద్, పోషణ్ అబ్యాన్ కోఆర్డినేటర్ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్