రుణలక్ష్యం రూ.11,866 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రుణలక్ష్యం రూ.11,866 కోట్లు

May 29 2025 10:01 AM | Updated on May 29 2025 10:01 AM

రుణలక

రుణలక్ష్యం రూ.11,866 కోట్లు

లక్ష్యం మేరకు అందించేలా చర్యలు తీసుకుంటాం

లక్ష్యం మేరకు వంద శాతం రుణాలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటాం. రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే క్రెడిట్‌ స్కోర్‌ పెరగడంతోపాటు మళ్లీ రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వార్షిక రుణ లక్ష్యం మేరకు ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాల్లో వంద శాతం లక్ష్యం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం.

–చింతల బాపూజీ,

లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, సూర్యాపేట

నాగారం : జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అధికార యంత్రాంగం ఖరారు చేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య, ప్రాధాన్యేతర రంగాలకు రూ.11,866.02 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలతోపాటు విద్య, గృహ, స్వయం సహాయక సంఘాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు అందించేలా ప్రణాళిక తయారు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి రూ.2871.86 కోట్ల అదనంగా పెంచారు.

రుణ ప్రణాళికలో ఇలా..

జిల్లాలో 3.03 లక్షల మంది పట్టా భూములు కలిగిన రైతులు ఉన్నారు. ఈ వానాకాలంలో జిల్లాలో 6.17 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. అయితే ఈ సారి వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు (వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, గృహ నిర్మాణం తదితరాలు) రూ.9669.41కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు (వ్యక్తిగత రుణాలు, వాణిజ్యం, నాన్‌ ప్రియారిటీ సెక్టార్‌లకు) రూ.2196.79 కోట్లు కేటాయించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అన్నదాతలకు అండగా ఉండేలా రుణ మొత్తాన్ని పెంచారు. రైతులు పంట పొలాల్లో సాగునీటి కల్పన, వ్యవసాయ యాంత్రీకరణ, పాడి పరిశ్రమ, భూముల అభివృద్ధి, విత్తనోత్పత్తి, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన, స్వయం సహాయక సంఘాలకు, విద్య, గృహ రుణాలు అందించేలా రుణ ప్రణాళిక తయారు చేశారు.

గత ప్రణాళికలో లక్ష్యానికి మించి చెల్లింపులు....

జిల్లా వ్యాప్తంగా 23 బ్యాంకులు ఉండగా వాటి పరిధిలో 162 బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణవార్షిక ప్రణాళికలో జిల్లాకు 8994.16 కోట్లు ఖరారు చేశారు. అనంతరం 100శాతం లక్ష్యం పూర్తికాగా.. ఆయా రంగాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో లక్ష్యానికి మించి అంటే గత ఏడాది రూ.1431.25 కోట్లు అదనంగా చెల్లింపులు చేశారు. గత ఏడాది లక్ష్యం రూ.8994.16 కాగా రూ.10425.41 కోట్లు రుణాలు చెల్లించారు.

వందశాతం అమలు చేస్తేనే..

జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాలు వ్యవసాయం, తదితర రంగాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటాయి. అలాంటి వారికి రుణాలు ఎంతగానో అవసరం. బ్యాంకుల ద్వారా రుణం మంజూరు కాకుంటే అధిక వడ్డీకి బయట అప్పుచేసి పెట్టుబడి పెడితే కష్టార్జితం మొత్తం అప్పులకు కట్టే వడ్డీకే సరిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. రుణ ప్రణాళిక తయారు చేయడమే కాదు.. వంద శాతం అమలు చేస్తేనే జిల్లా ప్రజలకు ఎంతో మేలు కలగనుంది.

2025–26 వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

ఫ వ్యవసాయ రంగంలో మౌలిక

వసతుల కల్పనకు ప్రాధాన్యం

ఫ చిన్నమధ్య తరహా పరిశ్రమకు సైతం..

ఫ గతేడాదితో పోలిస్తే

రూ.2871.86 కోట్లు అదనం

పంట రుణాలు : రూ.3861.42

వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.2999.49

చిన్న, మధ్య తరహా పరిశ్రమలు: రూ.2418.38

ఇతర ప్రాధాన్యత రంగాలు: రూ.390.12

నాన్‌ ప్రియారిటీ సెక్టార్‌కు : రూ.2196.61

రుణలక్ష్యం రూ.11,866 కోట్లు1
1/2

రుణలక్ష్యం రూ.11,866 కోట్లు

రుణలక్ష్యం రూ.11,866 కోట్లు2
2/2

రుణలక్ష్యం రూ.11,866 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement