
పోలీసులు ప్రజలతో మమేకం కావాలి
నాగారం : పోలీసులు ప్రజలతో మమేకమై ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం నాగారం పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ పార్థసారథి, సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
చట్టాలను గౌరవించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, నాగారం సీఐ, రఘువీర్ రెడ్డి, తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ