
శాస్త్రోక్తంగా శ్రీలక్ష్మీ నారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక అర్చనలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేసి నిత్యకల్యాణం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్ పాల్గొన్నారు.