
నెరవేర్చలేని హామీలతో కాంగ్రెస్ అభాసుపాలు
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి
హుజూర్నగర్: నెరవేర్చలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి విమర్శించారు. సోమవారం హుజూర్నగర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆపార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. అతి తక్కువ సమయంలోనే వైఫల్యం చెందింది సీఎం రేవంత్రెడ్డి అని పేర్కొన్నారు. ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, పట్టణ అధ్యక్షుడు బెల్లకొండ అమర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జయబాబు, మాజీ వైస్చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, నాయకులు డాక్టర్ కేఎల్ఎన్.రెడ్డి, డి.అప్పిరెడ్డి, కె.వెంకట్రెడ్డి, ఎస్.బసవయ్య, ఐ.పిచ్చయ్య, ఎ.సురేష్, ఎం.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.