ఎయిర్‌పోర్టు వద్దు.. పచ్చని భూములే ముద్దు | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు వద్దు.. పచ్చని భూములే ముద్దు

Jul 4 2025 7:13 AM | Updated on Jul 4 2025 7:13 AM

ఎయిర్‌పోర్టు వద్దు.. పచ్చని భూములే ముద్దు

ఎయిర్‌పోర్టు వద్దు.. పచ్చని భూములే ముద్దు

మందస: తమకు ఎయిర్‌పోర్టు వద్దని, పచ్చని భూములే ముద్దు అని మందస మండలం టి.గంగువాడ గ్రామస్తులు తేల్చిచెప్పారు. గ్రామానికి చెందిన చిత్త గున్నయ్య ఆధ్వర్యంలో బాధిత రైతులు కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులుగా గ్రామానికి కొందరు అధికారులు వచ్చి సర్వే పేరిట వచ్చి కొలతలు వేయడానికి మిషన్లు తీసుకురావడం బాధాకరమన్నారు. తమ భూములపై ఏ హక్కుతో కొలతలు వేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శిరీష స్పందించి తమ భూములను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో దాసరి మోహన్‌రావు, జోగి మోహన్‌రావు, రామారావు, పుక్కల్ల నారాయణ, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement