
విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి టౌన్: విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారంతో పాటు మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ ఆ శాఖ ఎస్ఈ సంపత్కుమార్ను మీటర్ రీడర్లు వేడుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఈని ఆయన చాంబర్లో కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. 20 సంవత్సరాలుగా మీటర్ రీడర్లుగా పనిచేస్తున్నామని, మూడు నెలలుగా వేతనాలు ఇవ్వక పోవడంతో కుటుంబపోషణ భారమైందని వాపోయారు. పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకపోయినా తమకు న్యాయం జరగలేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎస్కో అకౌంట్ ఓనెన్ చేసి జీతాలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు రవి, వినోద్, నరేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.