
దళితులకు రక్షణ లేదు
కూటమి సర్కార్ హయాంలో దళితులపై దాడులు, దుర్మార్గాలు పెరిగిపోయాయి. ఏడుగుర్రాలపల్లిలో 14 మంది దుర్మార్గులు ఓ దళిత బాలికపై నెలలుగా అత్యాచారకాండ సాగించినా దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి అనిత, ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న దళిత ఎమ్మెల్యే స్పందించకపోవడం దుర్మార్గం. మేమైనా వెళ్లి బాలిక కుటుంబానికి ధైర్యం చెబుదామనుకుంటే పోలీసుల ద్వారా అడుగడుగునా అడ్డగించారు. – ఈరలక్కప్ప,
వైఎస్సార్సీపీ మడకశిర సమన్వయకర్త