ఎట్టకేలకు వినియోగంలోకి జనరేటర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు వినియోగంలోకి జనరేటర్‌

Jun 13 2025 4:59 AM | Updated on Jun 13 2025 4:59 AM

ఎట్టక

ఎట్టకేలకు వినియోగంలోకి జనరేటర్‌

ధర్మవరం అర్బన్‌: స్థానిక ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్‌ సెంటర్‌కు ఏర్పాటు చేసిన జనరేటర్‌ ఎట్టకేలకు పనిచేయడం మొదలు పెట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ సొంత నియోజకవర్గంలోని ఆస్పత్రిలో జనరేటర్‌ పనిచేయకపోవడం... విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు చోటు చేసుకుంటుండడంతో డయాలసిస్‌ రోగులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 11న ‘డైయాలసిస్‌’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహికేర్‌ ఏజెన్సీ నిర్వాహకులతో ఫోన్‌లో మాట్లాడారు. తీవ్రస్థాయిలో మందలించారు. దీంతో రహికేర్‌ ఏజెన్సీ నిర్వాహకుల నుంచి సమాచారం అందుకున్న జనరేటర్‌ కంపెనీ సాంకేతిక నిపుణులు బుధవారం ఏరియా ఆస్పత్రికి చేరుకుని జనరేటర్‌లో తలెత్తిన లోపాను సరిచేశారు.

ఎట్టకేలకు వినియోగంలోకి  జనరేటర్‌1
1/1

ఎట్టకేలకు వినియోగంలోకి జనరేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement