
పంటల సాగులో వైవిధ్యం అవసరం
హిందూపురం: పంటల సాగులో వైవిధ్యతతో పాటు సాంకేతికను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ చండ్రాయుడు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా హిందూపురం మండలం కిరికెర, బసవనపల్లి రైతు సేవా కేంద్రాల్లో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందుల వినియోగానికి స్వస్తి చెప్పాలన్నారు. కొత్త వంగడాలు, డ్రోన్ స్ప్రేయింగ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. ప్రతాప్, హేమంత రాజు, కె.బాలాజీ నాయక్, డాక్టర్ శిరీషతో పాటు మండల వ్యవసాయాధికారులు సురేంద్ర నాయక్, మహేష్ నాయక్, బీమా కంపెనీ ప్రతినిధులు అశోక్, నరేంద్ర, రైతు సేవ కేంద్ర సిబ్బంది కృష్ణవేణి, రైతులు పాల్గొన్నారు.
న్యాయవాదికి
‘సంగం‘ బెదిరింపు లేఖ
చిలమత్తూరు: న్యాయవాది గోవిందరాజులుకు హిందూపురం మున్సిపాలిటీ మాజీ కమిషనర్ సంగం శ్రీనివాసులు బెదిరింపు లేఖ పంపడం సంచలనం రేకెత్తించింది. ఆయన కమిషనర్గా పనిచేసిన కాలంలో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మున్సిపల్ శాఖలోని ఉన్నతస్థాయి అధికారులకు లేఖ రాయడంతో పాటు కమిషనర్గా తన నియామకాన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టుకు వెళ్లడం వంటి అంశాలపై ఏ ఆధారాలతో ఆరోపణలు చేశావని లేఖలో సంగం శ్రీనివాసులు ప్రశ్నించారు. ఆధారాలు చూపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బెదిరింపులకు దిగారు. అయితే ఈ అంశంలో న్యాయవాది గోవిందరాజులు కూడా లేఖ ద్వారా ఘాటుగానే స్పందించారు. హిందూపురం మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, కమిషనర్ అక్రమాలపై దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టాలని ఉన్నతాదికారులుకు లేఖ రాసినట్లు వివరించారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోతే హైకోర్టు, ఏసీబీ కోర్టుకు వెళ్లి శ్రీనివాసులు అవినీతిపై పోరాడతానని పేర్కొన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే న్యాయవాది అయిన తనకు ఒక అధికారి బెదిరింపు లేఖ పంపడం వెనుక ఉన్న దురుద్దేశం తనకు తెలుసునన్నారు. కాగా న్యాయవాదికి కమిషనర్ రాసిన లేఖ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఇద్దరు పిల్లలతో కలసి తల్లి అదృశ్యం
ఉరవకొండ: నియోజకవర్గ కేంద్రానికి చెందిన వివాహిత షాహినా తన కుమారుడు, కుమార్తెతో కలసి గురువారం నుంచి కనిపించకుండా పోయింది. గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ మహానంది తెలిపారు.