జీపులో వ్యక్తి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

జీపులో వ్యక్తి అనుమానాస్పద మృతి

Jun 13 2025 4:59 AM | Updated on Jun 13 2025 1:09 PM

-

వ్యక్తి అనుమానాస్పద మృతి

కనగానపల్లి: మండల పరిధిలోని దాదులూరు కొట్టాల సమీపంలో 44వ జాతీయ రహదారిపై వాహనంలో వెళ్తున్న ఒక వ్యక్తి అనుమానస్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. అనంతపురం నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న ఓ జీపు (తుపాన్‌) రాత్రి సమయంలో రహదారి పక్కన డ్రైవర్‌ ఆపాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు కొందరు వాహనం దగ్గరకు వెళ్లి చూడగా.. అందులో ఓ వ్యక్తి ఇరుక్కొని విగతజీవిగా ఉన్నట్లుగా గుర్తించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, వాహనంలో ఇరుక్కొని మృతి చెందిన వ్యక్తి కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి చెందిన వాడిగా తెలిసింది. కానీ వాహనం ప్రమాదానికి గురై అతను మృతి చెందాడా? లేక ఎవరైనా అతనిని హతమార్చి వాహనంలో పడేసి వెళ్లారా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

వివాహిత ఆత్మహత్య 

ధర్మవరం అర్బన్‌: స్థానిక గూడ్స్‌షెడ్డు కొట్టాలకు చెందిన వివాహిత ఈశ్వరమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త మల్లికార్జున, ముగ్గురు కుమారులు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గురువారం చెరువు ఒకటో మరువ వద్ద నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఐ నాగేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement