
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ (45) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. వివరాలు... చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లికి చెందిన ఓ మహిళ పెద్ద కర్మ కార్యక్రమంలో గురువారం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొత్తచెరువు నుంచి సప్లయర్స్ సామగ్రిని తెప్పించుకున్నారు. అదే సప్లయర్స్లో కూలి పనులతో జీవనం సాగిస్తున్న సత్యనారాయణ పనిలో భాగంగా బుధవారం గంగినేపల్లికి చేరుకున్నాడు. షామియానా ఏర్పాటు చేస్తూ ఇంటికి తాడు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కొత్తచెరువు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందనట్లు నిర్ధారించారు. ఘటనపై సీకేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.