గాయపడిన మహిళా ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన మహిళా ఉద్యోగి మృతి

Jun 12 2025 3:33 AM | Updated on Jun 12 2025 3:33 AM

గాయపడిన మహిళా ఉద్యోగి మృతి

గాయపడిన మహిళా ఉద్యోగి మృతి

ఓర్వకల్లు: ప్రమాదంలో గాయపడిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య ముకుంద ప్రియ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సచివాలయం–2లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త చంద్రారెడ్డి ఆర్మీకి వెళ్లడంతో కర్నూలులో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ముకుంద ప్రియ నివాసముంటూ రోజూ కర్నూలు నుంచి స్కూటీపై విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో గత నెల 20న విధులకు వెళ్తుండగా రోడ్డుపై నిలబడిన లారీని ఢీకొన్నారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందారు. మృతురాలి తండ్రి రుక్మాంగదరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement