51 ఏళ్ల తర్వాత కలిశారు | - | Sakshi
Sakshi News home page

51 ఏళ్ల తర్వాత కలిశారు

Jun 12 2025 3:33 AM | Updated on Jun 12 2025 3:33 AM

51 ఏళ్ల తర్వాత కలిశారు

51 ఏళ్ల తర్వాత కలిశారు

హిందూపురం టౌన్‌: స్థానిక ఎస్‌డీజీఎస్‌ కళాశాలలో 1972–74లో కలసి ఇంటర్మీడియట్‌ చదువుకున్న వారు 51ఏళ్ల తర్వాత బుధవారం ఓ తోటలో ఒక్కటయ్యారు. వీరిలో చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ పదవీవిరమణ పొందారు. స్నేహితులను చూడగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మురిసిపోయారు. అలనాటి అల్లరి ఆటలు, పాటలు, చదువు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు దేవాంగం శంకరప్ప, సత్యనారాయణ, ఆనందరెడ్డి నేతృత్వం వహించగా శంకరప్ప, సత్యనారాయణ, ఆనందరెడ్డి, ధనలక్షి్‌, శ్రీనివాసులు, అనంతరామ్‌, రమేష్‌, సుందరమూర్తి, మహీధర్‌, వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement