● ధర్మవరం వాసి నేత్రదానం | - | Sakshi
Sakshi News home page

● ధర్మవరం వాసి నేత్రదానం

Jun 11 2025 7:51 AM | Updated on Jun 11 2025 7:51 AM

●  ధర

● ధర్మవరం వాసి నేత్రదానం

ధర్మవరం అర్బన్‌: స్థానిక మార్కెట్‌ వీధికి చెందిన రేపాకుల రమేష్‌(58) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు వైకే శ్రీనివాసులు, పోలా ప్రభాకర్‌, డాక్టర్‌ బీవీ సుబ్బారావు, జయరామ్‌, మోహన్‌.. మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ డాక్టర్‌ కుళ్లాయప్ప పర్యవేక్షణలో కంటి రెట్రావైల్‌ సెంటర్‌ టెక్నీషియన్‌ రాఘవేంద్ర, భాస్కర్‌రెడ్డి, రఘువీరా సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమార్తెలు రేపాకుల శ్రుతి, శ్రీరక్షకు యువర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేత్రాలు మరో ఇద్దరికి చూపును అందిస్తాయని తెలిపారు.

నీట మునిగి బాలుడి మృతి

చెన్నేకొత్తపల్లి: ప్రమాదవశాత్తు చెరువు పడిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన ప్రసాద్‌, అంజలి దంపతుల కుమారుడు దీక్షిత్‌ (7) ఉన్నాడు. గ్రామ శివారులోని చెరువులో మంగళవారం దుస్తులు ఉతికేందుకు వెళుతున్న తన అవ్వ నాగలక్ష్మమ్మతో కలసి దీక్షిత్‌ కూడా వెళ్లాడు. అవ్వ దుస్తులు ఉతుకుతున్న సమయంలో గట్టున ఉన్న దీక్షిత్‌ ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నాగలక్ష్మమ్మ వేసిన కేకలు వృథా అయ్యాయి. వెంటనే గ్రామంలోకి వెళ్లి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో తాత కాటమయ్యతో పాటు చుట్టుపక్కల వారు చెరువు వద్దకు చేరుకుని గాలించి వెలికి తీసేలోపు బాలుడు మృతిచెందాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.

●  ధర్మవరం వాసి నేత్రదానం 1
1/2

● ధర్మవరం వాసి నేత్రదానం

●  ధర్మవరం వాసి నేత్రదానం 2
2/2

● ధర్మవరం వాసి నేత్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement