
యోగాంధ్ర ఏర్పాట్ల పరిశీలన
ధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, స్వచ్చంధ సేవా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ మహేష్కు సూచించారు. మంత్రి సత్యకుమార్, కలెక్టర్ చేతన్, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట తహసీల్దార్ నటరాజ్, ఎంపీడీఓ సాయిమనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్ ఉన్నారు.
దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
ధర్మవరం అర్బన్: వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీలో నివాసముంటున్న షేక్ అన్వర్పై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి గాయపరిచారు. అన్వర్ భార్య ముబీనా అక్క హసీనా భర్త 14 సంవత్సరాల క్రితం మృతిచెందడంతో ఆమె ఇందిరమ్మకాలనీలో నివసిస్తున్న ఇంతియాజ్ బాషాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. బక్రీద్ రోజు హసీనాను ఇంటికి పిలిచి ఇలాంటి సంబంధాలు మంచివి కావని అన్వర్, ముబీనా హితవు పలికారు. ఈ విషయాన్ని ఇంతియాజ్కు హసీనా తెలపడంతో అతను ఆదివారం తన స్నేహితులు చాంద్బాషా, మహేష్తో కలసి అన్వర్ ఇంటికెళ్లి దాడి చేసి గాయపరిచారు. గాయపడిన భర్తను స్థానిక ప్రభుత్వాస్పత్రి భార్య ముబీనా తీసుకెళ్లి చికిత్స చేయించారు. కోలుకున్న అనంతరం మంగళవారం బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.