
తల్లికి ‘వంచన’
చిత్రంలో కనిపిస్తున్నది పరిగి మండలం శ్రీరంగరాజుపల్లికి చెందిన నారాయణస్వామి, శిల్ప దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకం అందుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు.. ఇంట్లో అందరికీ పథకం వర్తిస్తుందంటే ఆనందపడ్డారు. కానీ అధికారం చేపట్టాక పథకం ప్రస్తావనే లేకపోవడంతో ఇప్పుడు ఆరుగురు పిల్లలను చదివించడం ఇబ్బందిగా మారి ఒకరిద్దరిని చదువు మాన్పించే పరిస్థితి నెలకొంది.
ఫీజులు కట్టలేక ఇబ్బందులు
మాకు ఇద్దరబ్బాయిలు. ఓడీ చెరువులోని ఓ ప్రైవేటు స్కూలులో చదివిస్తున్నాం. ఇద్దరికీ చాలా ఖర్చు వస్తోంది. ఫీజులు కట్టేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు మా కుటుంబానికి ఏటా తల్లికి వందనం పథకం కింద రూ.30 వేలు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే ఒక ఏడాది మిస్ అయింది. ఈసారైనా డబ్బులు జమ చేయాలని కోరుతున్నాం. – భారతి, పరాకువాండ్లపల్లి,
తనకల్లు మండలం
అవస్థలు పడుతున్నాం
మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నార్పలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పెద్ద కుమారుడు ఎనిమిదో తరగతి, చిన్న కుమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. ఇద్దరికీ ఏడాదికి రూ.80 వేలు ఫీజులు కడుతున్నాం. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం వర్తించడంతో ఇబ్బంది లేకుండా ఫీజులు చెల్లించగలిగాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకం లబ్ధి చేకూరలేదు. దీంతో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం.
– ఎ.దేవి, రామాపురం, తాడిమర్రి.
సాక్షి, పుట్టపర్తి: ఇంట్లో ఎందరుంటే అందరికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు చేస్తామని 2024 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఏడాది గడిచిపోయింది. ఇప్పటికీ అతీగతి లేదు.
ఈ సారైనా నెరవేరేనా?
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తల్లికి వందనం పథకం అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు సక్రమంగా ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తూ వచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ఫీజులను సకాలంలో తల్లిదండ్రులు చెల్లించగలిగారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏడాది పాటు పథకం లబ్ధిని ఎగ్గొట్టి తాజాగా ఈ నెల 15 లోపు ప్రకటించింది. గతేడాది తరహాలోనే ఈసారి కూడా పథకం లబ్ధి చేకూరకపోవచ్చునని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రైవేటు సంస్థల్లో ఫీజుల మోత..
తల్లికి వందనం పథకం అతీగతీ లేకపోవడంతో ప్రైవేటు సంస్థల్లో ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సరైన నిర్వహణ లేకపోవడంతో అక్కడికి విద్యార్థులను పంపించలేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. డిమాండ్కు అనుగుణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి తెరలేపారు.
నాలుగేళ్లలో రూ.946 కోట్లు..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగు విడతలుగా జిల్లాకు ‘అమ్మ ఒడి’ పథకం కింద రూ.946 కోట్లు నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. ఏటా సగటున 1.62 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ప్రస్తుతం జిల్లాలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సుమారు 2.37 లక్షల మంది ఉన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో వీరిలో ఎంత మందికి లబ్ధి చేకూరుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
అమ్మఒడి పథకాన్ని ‘తల్లివందనం’గా మార్చిన కూటమి
ఇంట్లో ఎంత మంది చదువుకుంటే
అందరికీ ఆర్థిక సాయం అంటూ హామీ
ఏడాది ముగిసినా లబ్ధిదారులకు
అందని నగదు
తల్లులను వంచించిన చంద్రబాబు
‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ఇంట్లో పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఎందరు ఉన్నా.. ఒక్కొక్కరికీ రూ.15 చొప్పున అందరికీ తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తాం’
– ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నేటికీ కార్యరూపం
దాల్చకపోవడం గమనార్హం.

తల్లికి ‘వంచన’

తల్లికి ‘వంచన’

తల్లికి ‘వంచన’

తల్లికి ‘వంచన’

తల్లికి ‘వంచన’