
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
పుట్టపర్తి టౌన్: రోజూ యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినం మాసోత్సవాలను పురస్కరించుకుని సోమవారం పుట్టపర్తిలో చేపట్టిన అవగాహన ర్యాలీని వారు ప్రారంభించి, మాట్లాడారు. ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, లేపాక్షి ప్రాంతాల్లో పర్యాటక యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, కమిషనర్ క్రాంతికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు లేపాక్షిలో జిల్లా స్థాయి యోగా
లేపాక్షి: స్థానిక వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో మంగళవారం ఉదయం జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బెల్టుషాపులు బంద్ చేయించి
గ్రామంలోకి అడుగు పెట్టండి
● ఎకై ్సజ్ పోలీసులతో నాటుసారా తయారీదారుల వాగ్వాదం
గుంతకల్లు: గ్రామాల్లో బెల్టుషాపులు బంద్ చేయిస్తే తాము నాటుసారా తయారీని మానుకుంటామని ఎకై ్సజ్ పోలీసులతో గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండా వాసులు వాగ్వాదానికి దిగారు. పులగుట్టపల్లి పెద్ద తండాలో ఆదివారం సాయంత్రం గుంతకల్లు ఎకై ్సజ్ అధికారులు వెంకటేష్, గోపాల్నాయక్, నాగరాజు తనిఖీలు చేపట్టారు. లాలూస్వామి నాయక్ ఇంట్లో పది లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో లాలూస్వామి నాయక్ వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో కృష్ణానాయక్, నెట్టప్పనాయక్, బాలాజీనాయక్తో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ శేఖర్నాయక్ అక్కడకు చేరుకుని లాలూస్వామి నాయక్కు మద్దతుగా నిలిచారు. బెల్టుషాపులు బంద్ చేయించకుండా మరోసారి గ్రామంలోకి కాలుపెడితే పొలిమేర కూడా దాటలేరంటూ హెచ్చరించారు. ఘటనపై ఎకై ్సజ్ సీఐ శివసాగర్ను వివరణ కోరగా... జరిగిన ఘటన వాస్తవమేనని అంగీకరించారు. ఇప్పటికే లాలూస్వామి నాయక్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.