
రేషన్ బియ్యం పట్టివేత
బత్తలపల్లి: స్థానిక బృందావనం కాలనీలో నివాసముంటున్న మల్లికార్జున నాయక్... తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 750 కిలోల రేషన్ బియ్యాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రీజినల్ విజిలెన్స్ అధికారులు శ్రీగోపాలుడు, రవీంద్రనాథ్, బత్తలపల్లి సీఎస్డీటీ రామకృష్ణ తెలిపారు. బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
లేపాక్షి: మండలంలోని తిరుమలదేవరపల్లి గ్రామానికి చెందిన వివాహిత సవిత అలియాస్ సునీత(39) ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమార్తె మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.