
నెత్తురోడిన రహదారి
గార్లదిన్నె: తిమ్మంపేట సమీపంలో జాతీయరహదారి నెత్తురోడింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని లారీ వెనుకనుంచి ఢీకొంది. ఈ ఘటనలో మహిళా కూలీ దుర్మరణం చెందింది. మరో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలిలో రోడ్డుపై ఎగిరిపడ్డ కూలీలు రక్తగాయాలతో ఆర్తనాదాలు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం ఎగువపల్లి, కొండకింద కొట్టాల, కల్లూరుకు చెందిన దాదాపు 35 మంది కూలీలు చీనీకాయలు తొలగించే పనికి శనివారం ఉదయం కల్లూరు నుంచి బొలెరో వాహనంలో ఆత్మకూరు మండలం సిద్దరాంపురం వెళ్లారు. సాయంత్రం పని ముగించుకొని కూలీలందరూ తిరిగి బొలెరో వాహనంలో కల్లూరుకు బయల్దేరారు. తిమ్మంపేట సమీపంలోని 44వ జాతీయరహదారిపైకి వచ్చేసరికి రాత్రి అయ్యింది. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ.. బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న కొండకింద కొట్టాలకు చెందిన మహిళా కూలీ మంగమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందింది. మరో 16 మంది కూలీలు ఎగిరి రోడ్డుపై పడ్డారు. రక్షించండంటూ ఆర్తనాదాలు చేస్తుండడంతో స్థానికులు గమనించి 108,పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలం వద్దకు చేరుకుని గాయపడిన ఎగువపల్లికి చెందిన నాగలక్ష్మి, పద్మావతి, శివమ్మ, లక్ష్మీదేవి, యశ్వంత్, పార్వతమ్మ, దేవమ్మ, ఇందిర, లక్ష్మమ్మ, గుడ్డాలపల్లికి చెందిన ఈరమ్మ, కల్లూరుకు చెందిన వరలక్ష్మి, సావిత్రి, రామలక్ష్మి, భార్గవి, భావన, సావిత్రమ్మని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో నాగలక్ష్మి, ఈరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కిక్కిరిసిన సర్వజనాస్పత్రి
అనంతపురం మెడికల్ : తిమ్మం పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతో సర్వజనాస్పత్రి కిక్కిరిసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు ఎమర్జెన్సీ వార్డులో పెద్దఎత్తున వినిపించాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు సంబంధిత వైద్యులను ఆదేశించారు.
బొలెరోను ఢీకొన్న లారీ
మహిళా కూలీ దుర్మరణం
మరో 16 మందికి గాయాలు
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం

నెత్తురోడిన రహదారి

నెత్తురోడిన రహదారి

నెత్తురోడిన రహదారి

నెత్తురోడిన రహదారి

నెత్తురోడిన రహదారి

నెత్తురోడిన రహదారి