ఆస్ట్రేలియాలో వైఎస్సార్‌సీపీకి తరగని ఆదరణ | - | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో వైఎస్సార్‌సీపీకి తరగని ఆదరణ

May 1 2025 12:14 AM | Updated on May 1 2025 12:14 AM

ఆస్ట్రేలియాలో వైఎస్సార్‌సీపీకి తరగని ఆదరణ

ఆస్ట్రేలియాలో వైఎస్సార్‌సీపీకి తరగని ఆదరణ

అనంతపురం కార్పొరేషన్‌: వైఎస్సార్‌సీపీపై ఆస్ట్రేలియాలో ప్రవాసాంధ్రులు విశేష ఆదరణ కనబరిచారు. ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగ కో ఆర్డినేటర్‌ ఆలూరు సాంబశివారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌ దేశాల్లో ఆలూరు సాంబశివారెడ్డి పర్యటించి అక్కడి ప్రవాసాంధ్రులతో సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సిడ్నీకి చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టులో ఆస్ట్రేలియా వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ చింతలచేరు సూర్యనారాయణరెడ్డి నేతృత్వంలో లంకెల రాజశేఖరరెడ్డి, యేళ్ల అమర్‌నాథ్‌, గొళ్లపల్లి చంద్రమౌళీరెడ్డి, కేఎల్‌ ఉమేష్‌, మురారి చింతల పెద్దిరెడ్డి, ఉమ్మడి మనోహర్‌, గాయం శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, రాజేందర్‌, విజయ్‌, దేవశేఖర్‌, బొమ్మక శివారెడ్డి ఘనస్వాగతం పలికారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పాలనపై ప్రవాసాంధ్రులందరూ సంతృప్తితో ఉన్నారని, రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు భరోసానిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement