
‘సాక్షి’ కార్యాలయాలపై దాడులను ఆపాలి
నెల్లూరు సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై చేస్తున్న దాడులను ఆపాలని నెల్లూరు రూరల్ ఎస్సై ప్రసాద్రెడ్డికి మంగళవారం ‘సాక్షి’ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అంశం మీద సంబంధం లేని విషయాన్ని ‘సాక్షి’కి ఆపాదిస్తూ కొందరు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం సరికాదన్నారు. ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ సిబ్బంది పాల్గొన్నారు.