ఉదయగిరి నుంచి గ్రావెల్‌, రఫ్‌స్టోన్‌, క్వార్ట్‌ ్జ | - | Sakshi
Sakshi News home page

ఉదయగిరి నుంచి గ్రావెల్‌, రఫ్‌స్టోన్‌, క్వార్ట్‌ ్జ

May 2 2025 12:06 AM | Updated on May 2 2025 12:06 AM

ఉదయగిరి నుంచి గ్రావెల్‌, రఫ్‌స్టోన్‌, క్వార్ట్‌ ్జ

ఉదయగిరి నుంచి గ్రావెల్‌, రఫ్‌స్టోన్‌, క్వార్ట్‌ ్జ

‘మా నియోజకవర్గం నుంచి రూ.కోట్ల విలువైన సహజవనరుల

సంపదను కొల్లగొడుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ పోలీసులను పురమాయించి గ్రావెల్‌ రవాణా చేసే వాహనాలను సీజ్‌ చేయించి కేసులు నమోదు చేయించారు. నెల్లూరు నగర పరిధిలో దీనదయాళ్‌నగర్‌ ప్రాంతంలో పెన్నానది

నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. టీడీపీకి చెడ్డ పేరు తెచ్చే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సుమారు నాలుగు గంటల పాటు నానా హంగామా చేశారు. ఈ ఇద్దరి వార్నింగ్‌ల వెనుక స్వార్థమే కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న తమను పట్టించుకోకుండా టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారనే అక్కసు తప్ప, సహజవనరులను కాపాడే ఉద్దేశం లేదు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల అండతో తమ్ముళ్లు సహజ వనరుల దోపిడీకి తెగబడుతున్నారు. సోమశిల నుంచి ఇందుకూరుపేట వరకు ఉన్న పెన్నానదిలో అడుగడుగునా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఇక మిగతా నియోజకవర్గాల్లో గ్రావెల్‌, మట్టి, ఇసుక, క్వార్ట్‌ ్జ ఖనిజ సంపదను విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మరి కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ముఖ్య నేతలను పట్టించుకోకుండా సాగుతున్న ఈ దోపిడీ దందాపై ఇటీవల వారే అడ్డుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమకు వాటాలు ఇవ్వకుండానే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో తరహా దోపిడీ విధానం చూసి తమ్ముళ్లలోనే కడుపు మండి తిరుగుబాటు వరకు వెళ్లారు. ఇటీవల ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ తన నియోజకవర్గంలో మంత్రి ఆనం అనుచరుడి గ్రావెల్‌ దందాపై కన్నెర్ర చేయగా, తాజాగా మంత్రి నారాయణ ఇలాకాలో ఆయన ముఖ్య అనుచరుడు ఇసుక దందాపై నుడా చైర్మన్‌ కోటంరెడ్డి హడావుడి చేయడం చూస్తుంటే తమ్ముళ్ల దోపిడీ విధానం చూసి ఛీదరించుకుంటున్నారు. ఈ వార్నింగ్‌లు కేవలం వాటాల కోసమేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే సహజవనరుల దోపిడీని బయట పెట్టినా.. అధికార యంత్రాంగం నెలవారీ మామూళ్లతో కళ్లకు గంతలు కట్టుకుని వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులే సదరు నేతలకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తూ మధ్యవర్తిత్వం, కేసులు నమోదు చేయడంలో సహకారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

మంత్రులు, ఎమ్మెల్యేల అండతో చెలరేగుతున్న ముఖ్య అనుచరులు

సహజ వనరుల దోపిడీతో రూ.కోట్లు కూడబెట్టుకుంటున్న వైనం

స్థానిక ముఖ్య నేతలను పట్టించుకోని పరిస్థితి

అసహనంతో రగిలిపోయి తిరుగుబాటు

మొన్న ఎమ్మెల్యే కాకర్ల, తాజాగా నుడా చైర్మన్‌ కోటంరెడ్డి

పెన్నానదిని భారీ యంత్రాలతో తోడేస్తూ..

నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్‌ వద్ద మంత్రి నారాయణ అండతో టీడీపీ నేతలు అనధికారికంగా రీచ్‌ను ప్రారంభించారు. నేరుగా రీచ్‌ వద్దకే కార్పొరేషన్‌ నిధులతో రహదారిని ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానం ముసుగేసి పగటి సమయాల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రాత్రయితే చాలు టీడీపీ నేతలు వారి అనుచర వర్గం యంత్రాలు పెట్టి పెన్నా నదిని కుళ్లబొడుస్తున్నారు. నిత్యం 50 భారీ వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అయితే పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న తనను కాదనే మరెవరికో ఇక్కడి ఇసుక అక్రమ రవాణాకు మంత్రి అండగా ఉండడంతో జీర్ణించుకోలేకపోయిన నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దీన్‌దయాళ్‌ నగర్‌లో జరిగే ఇసుక దోపిడీపై ఇటీవల కన్నెర్ర చేసి అడ్డుకున్నారు. అధికార యంత్రాంగాన్ని అక్కడికి రప్పించుకుని కోటంరెడ్డి హడావుడి చేయడం వెనుక ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరే కారణమని తెలుస్తోంది. పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారంటూ చేసిన రచ్చ వెనుక తనకు వాటాల ఒప్పందమే ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement