'డ్రీమ్ 11తో బంధం ముగిసింది'.. బీసీసీఐ అధికారిక ప్రకటన | Team India heads into Asia Cup without sponsor as BCCI-Dream11 deal discontinued | Sakshi
Sakshi News home page

BCCI: 'డ్రీమ్ 11తో బంధం ముగిసింది'.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Aug 25 2025 12:47 PM | Updated on Aug 25 2025 12:59 PM

Team India heads into Asia Cup without sponsor as BCCI-Dream11 deal discontinued

భార‌త క్రికెట్ జ‌ట్టుకు  జెర్సీ స్పాన్సర్​గా ఉన్న ఫ్యాంట‌సీ గేమ్ ఫ్లాట్ ఫామ్‌ డ్రీమ్ 11(Dream11)తో బీసీసీఐ ఒప్పందం ర‌ద్దు చేసుకుంది. 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని బీసీసీఐ  కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. దీంతో సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. కాగా ఈ  ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆగస్టు 20న లోక్‌సభ,  21న రాజ్యసభ ఆమోదించింది.

ఆ తర్వాత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఈ బిల్ ఇప్పుడు చట్టంగా మారింది. ఫలితంగా భారత జట్టుకు జెర్సీ స్పాన్పర్ లేకుండా పోయింది. కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్లను ఆహ్హానించనున్నట్లు  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.

"ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు- 2025 ఆమోదించబడిన తర్వాత బీసీసీఐ-డ్రీమ్ 11 మధ్య సంబంధాలను నిలిపివేస్తున్నాము. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోమని" దేవజిత్ సైకియా న్యూస్ ఏజెన్సీ ఎఎన్‌ఐతో పేర్కొన్నారు. 

2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్‌ 11’ ఒప్పందం కుదుర్చుకుంది.  ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్‌ను  ‘డ్రీమ్‌ 11’  భర్తీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో డ్రీమ్ 11 అగ్రిమెంట్ మధ్యలోనే  క్యాన్సిల్ అయింది.

ఇప్పుడు డ్రీమ్ 11 మధ్యలోనే నిష్క్రమించినప్పటి.. ఈ సంస్థపై భారత క్రికెట్‌ మండలి ఎలాంటి జరిమానా విధించడం లేదట. ఒప్పందం ప్రకారం చట్టపరమైన కారణాలతో మధ్యలో స్పాన్సర్‌షిప్‌ను వదిలేసినా.. ఎలాంటి జరిమానా పడకుండా నిబంధన ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement