ICC ODI Rankings: ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, పాక్‌ను వెనక్కునెట్టిన టీమిండియా

India Edge Pakistan In ICC ODI Rankings With Win Over England - Sakshi

IND VS ENG 1st ODI: తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లైంది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకడంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించిన రోహిత్‌ సేన 3 రేటింగ్‌ పాయింట్లను (108) సాధించి టాప్‌-3లోకి చేరి, పాక్‌ను నాలుగో స్థానానికి (106) నెట్టింది.

ఈ జాబితాలో న్యూజిలాండ్‌ (126) టాప్‌లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్‌ (122) రెండు, ఆసీస్‌ (101), సౌతాఫ్రికా (99) ఐదు ,ఆరు స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్‌ (96), శ్రీలంక (92), వెస్టిండీస్‌ (71), ఆఫ్ఘనిస్తాన్‌ (69), ఐర్లాండ్‌ (54) జట్లు వరుసగా 7 నుంచి 11 స్థానాల్లో నిలిచాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ 3లోకి చేరడంతో మూడు ఫార్మాట్లలో టాప్‌-3లో ఉన్న ఏకైక జట్టుగా నిలిచింది.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించడంతో  3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బట్లర్‌ సేన.. బుమ్రా (6/19), మహ్మద్‌ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 25.2 ఓవర్లలో 110 పరుగులకే చాపచుట్టేసింది.  జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా టాప్‌–6లో నలుగురు బ్యాటర్లు ‘డకౌట్‌’ అయ్యారు. 

మొత్తంగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదుగురు క్లీన్‌బౌల్డ్‌ కావడం విశేషం.  అనంతరం రోహిత్‌ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శిఖర్‌ ధవన్‌ (54 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్‌ 18.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. 
చదవండి: రో'హిట్‌' ధాటికి చిన్నారి విలవిల.. ఆందోళన వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top