All England Open 2023: Gayatri Pullela-Treesa Jolly Reach Quarters Ousting Former No-1 Pair - Sakshi
Sakshi News home page

All England Open 2023: సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ 

Mar 16 2023 7:02 PM | Updated on Mar 16 2023 7:37 PM

Gayatri Pullela-Treesa Jolly Reach Quarters Ousting Former No-1 Pair - Sakshi

ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ 2023 ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్‌ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సంచలనం కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ జోడి.. మాజీ ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ ఛాంపియన్స్‌ యుకీ ఫుకుషిమా, సయకా హిరోతా జంటపై 21-14, 24-22 తేడాతో స్టన్నింగ్‌ విక్టరీ అందుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను తొందరగానే గెలుచుకున్న గాయత్రి-టెస్రా జోడి రెండో గేమ్‌ను గెలవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. భారత జోడి 9 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సమయంలో జపాన్‌ జంట ఫుంజుకున్నారు. అయితే ఆరవ పాయింట్‌ దగ్గర గాయత్రి-టెస్రాలు సర్వీస్‌ను బ్రేక్‌ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement