ఉన్నత శిఖరాలను అధిరోహించాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Jul 2 2025 6:59 AM | Updated on Jul 2 2025 7:14 AM

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమి ప్రిన్సిపాల్‌ మధుకర్‌స్వామి

దుబ్బాక: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేడ్చల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమి కళాశాల ప్రిన్సిపాల్‌ మధుకర్‌స్వామి అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలో అఖిలరాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు వాట్‌ నెక్ట్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఎక్కువగా సెల్‌ఫోన్లు చూస్తున్నారని, అవసరముంటే తప్పా వాడకూడదన్నారు. గుట్కాలు , డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోద్దని సూచించారు. విద్యార్థుల నడవడికను వారి తల్లిదండ్రులు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలరాజ్‌ ఫౌండేషన్‌ అధినేత, కూకట్‌పల్లి ఎస్‌ఐ తౌడ సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్తలు చింత రాజు, నల్ల శ్రీనివాస్‌, సభ్యులు రవి, సాగర్‌, మహేష్‌, ప్రవీణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement