
ఇప్పటికే వర్షాలు కురిసేవి
జూన్లో వర్షాలు ప్రారంభమయ్యేవి. ఏప్రిల్లో వర్షాలు కురవడంతో సంబురపడ్డాం. కానీ ఆఽశించిన మేర కురవడం లేదు. చిరుజల్లులు మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నాయి. రైతులు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్ప్రింక్లర్లు, డ్రిప్ల ద్వారా పంటలకు నీరు అందించాల్సి వస్తుంది.
–రాజిరెడ్డి, రైతు, మాచాపూర్
జూలై 15 వరకు విత్తుకోవచ్చు
జిల్లాలో పలు చోట్ల రైతులు విత్తనాలు విత్తారు. జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అందువల్ల మంచి వర్షాలు కురిశాకే విత్తనాలు వేయాలి. కందులు సెప్టెంబర్ వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్న సంవత్సరం పొడవున విత్తుకునే అవకాశం ఉంది. రైతులు అధైర్యపడొద్దు. వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.
–రాధిక, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

ఇప్పటికే వర్షాలు కురిసేవి