
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
అదనపు కలెక్టర్ నగేశ్
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కూచన్పల్లి జడ్పీ హైస్కూల్ను సందర్శించి విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు సరిగా అర్థం చేసుకొని బాగా చదువుకోవాలన్నారు. గ్రామంలో బడీడు పిల్లలందరూ కచ్చితంగా పాఠశాలలోనే ఉండాలన్నారు. ఎవరైనా రాకుండా ఉంటే వారిని గుర్తించి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. తెలుగు ఉపాధ్యాయుడు శశికుమార్ తన కుమారుడికి, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న మరి కొంతమంది విద్యార్థులకు అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అడ్మిషన్ తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో మధుమోహన్, పాధ్యాయులు శివరాజ్, సుకన్య, శ్రీనివాస్, మల్లారెడ్డి ,సందీప్, సంతోషికుమారి, వినోద్, కొండల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజు, చక్రపాణి, కృష్ణవేణి , గంగమణి, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.