
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
కంది(సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని బేగంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గురువారం ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన కొలతలు, నియమాలను పాటించి ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. నిర్మాణాలు చేసుకుంటున్న వారందరికీ విడతలవారీగా బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్ రెడ్డి, హౌసింగ్ డీఈ మాధవరెడ్డి, ఏఈ మేఘనాథ్, తాజా మాజీ ఉపసర్పంచ్ మహేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి తారాబాయి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.