
75 సంవత్సరాల చరిత్ర
హుస్నాబాద్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 75 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇటీవల పూర్వ విద్యార్థులతో కలిసి వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకుంది. ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చింది. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి స్పీకర్ మధుసూదనా చారి, ప్రస్తుతం జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల డైరెక్టర్ గాజుల శ్యాంప్రసాద్ లాల్ ఈ బడిలో చదువుకున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. కంప్యూటర్ ల్యాబ్, స్టెమ్ సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఐఎఫ్టీ ప్యానెల్స్, రోజు వారి హాజరు యాప్, బాలికలు, బాలురకు ప్రత్యేక టాయిలెట్స్, తాగునీటి వసతి కోసం వాటర్ ప్లాంట్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, 230 డెస్క్లు, అన్ని తరగతుల్లో చాక్ బోర్డ్స్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇప్పించేందుకు ప్రత్యేక టీచర్ నియామకం, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక టాయిలెట్లు ఈ బడి ప్రత్యేకతలు.