
బడిగంటకు వేళాయే
సంగారెడ్డి జోన్: నేటి నుండి బడి గంట మోగనుంది. సుమారు నెలన్నర రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేస వి సెలవులలో ఆటపాటలు, విహారయాత్రలో గడిపిన చిన్నారులు బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమ య్యే సామగ్రి కొనుగోలుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీరిక లేకుండా గడుపుతున్నారు.
పాఠశాలలకు పుస్తకాలు, దుస్తులు
పాఠశాలలు తెరువక ముందే ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు పంపిణీ చేసింది. జిల్లాకు 7,33,210 పుస్తకాలు అవసరం ఉండగా 7,02,900 పుస్తకాలు పాఠశాలలకు చేరకున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు పాఠశాలలు తెరిచే నాటికి యూనిఫాం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా 1,09,000వేల యూనిఫాం చేరుకున్నాయి.
నేడు వట్పల్లిలో బడిబాట
పాఠశాలల పునఃప్రారంభఃలో భాగంగా నేడు వట్పల్లి మండలంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతతోపాటు కల్పించే మౌలిక వసతులు తదితర అంశాలను వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతూ బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తొలిసారిగా ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తొలిసారిగా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు బోధన అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు దఫాలుగా నిర్ణయించి, శిక్షణ అందించారు. అదేవిధంగా పాఠశాలల్లో పని చేసే సిబ్బందితో పాటు వంట నిర్వాహకులకు సైతం శిక్షణ ఇచ్చారు.
ఎంతో ఉత్సాహంగా బడికి..
సెలవుల తర్వాత పాఠశాలకు స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా వెళ్లేవాళ్లం. పాఠశాల ప్రారంభం అనగానే కొత్త పుస్తకాలు, నోట్ పుస్తకాలు సంతోషాన్ని ఇచ్చేవి. పుస్తకాలకు ర్యాపర్స్ వేసుకునేవాళ్లం. పాఠశాల ప్రారంభం రోజే స్నేహితులంతా కలుస్తారనే ఉత్సాహం ఉండేది. ప్రతీ ఒక్కరు చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
–వల్లూరు క్రాంతి, కలెక్టర్
స్నేహితులతో కలిసి నడుచుకుంటూ..
మా ఇంటి నుంచి పాఠశాలకు కిలోమీటరు దూరం ఉండేది. బడికి రోజూ స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. మొదటి రోజు పాఠశాల అనగానే కొత్తగా ఆనందంతోపాటుగా తెలియని అనుభూతి కలిగేది. కొత్త స్నేహితులు, కొత్త తరగతి గదిలో కూర్చోవటం సంతోషం కలిగించేది. ప్రతీ ఒక్కరు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి.
–పరితోశ్ పంకజ్, ఎస్పీ
నేటి నుంచి పాఠశాలలు
పునఃప్రారంభం
ఉపాధ్యాయులకు పూర్తయిన శిక్షణ
బడిబాట పట్టనున్న విద్యార్థులు
జిల్లాలోని పాఠశాలల వివరాలు
ప్రభుత్వ పాఠశాలలు 1,248
మోడల్ స్కూల్స్ 10
కేజీబీవీ 22
విద్యార్థులు 1,20,000
పాఠశాలలకు వచ్చిన పుస్తకాలు 7,02,900
యూనిఫాం 1,09,000

బడిగంటకు వేళాయే

బడిగంటకు వేళాయే