
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
కొల్చారం(నర్సాపూర్): బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో హోంగార్డు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిపై పోతంశెట్టిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే టీ జంక్షన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ వివరాల ప్రకారం... కౌడిపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మెగావత్ శివరాం(44) హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల డిప్యుటేషన్పై మెదక్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఎప్పటిలాగే ఉదయం బైక్పై శివరాం కౌడిపల్లి నుంచి మెదక్ వెళ్తున్నాడు. ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి పటాన్ చెరుకు వెళ్తోంది. ఏడుపాయల టీ జంక్షన్ వద్దకు రాగానే శివరాం బైకును ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.