
సబ్జైల్ను సందర్శించిన అధికారులు
జోగిపేట(అందోల్): జోగిపేట సబ్జైల్ను రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) సందీప్ శాండిల్య పలువురు ఐపీఎస్ అధికారులు బృందాలుగా వచ్చి మంగళవారం సందర్శించారు. సబ్జైలులోని అన్ని గదులను, ఏరియాను పరిశీలించారు. ఆకస్మికంగా జైలును సందర్శించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. డిటెక్టివ్ విభాగం డీసీపీ శ్వేతారెడ్డి, టీఎస్ఎన్ఏబీ సందీప్ శాండిల్యలు వేర్వేరుగా జైలును సందర్శించి జైలు పరిసర ప్రాంతాలను కలియతిరిగారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, అదనపు ఎస్పీ సంజీవరావు, ఐపీఎస్ అధికారి రమణకుమార్, డీఎస్పీ సత్తయ్యగౌడ్లతో కలిసి సందర్శించారు. స్థానిక సీఐ,ఎస్ఐలు కూడా వారి వెంట ఉన్నారు.
మోడల్ హౌజ్
నెల్లో పూర్తి చేయాలి
గృహనిర్మాణ పీడీ చలపతిరావు
కంగ్టి(నారాయణఖేడ్): నెల రోజుల్లోగా మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా గృహనిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ చలపతిరావు మంగళవారం ఏఈలను ఆదేశించారు. కంగ్టి మండల కేంద్రంలో మోడల్ హౌజ్ నిర్మాణానికి సంబంధించి మార్క్అవుట్ చేశారు. మండలంలోని గాంధీనగర్, జీర్గితండా, సుక్కల్తీర్థ్లలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఈ తివారీ, ఏఈలు సత్యనారాయణ, అంకుశ్, వంశీకృష్ణ పాల్గొన్నారు.