
జ్ఞాన ఉద్యమంలో భారత్ ముందంజ
గ్లోబల్ యంగ్ సైంటిస్ట్ సదస్సులో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచ జ్ఞాన ఉద్యమంలో భారత్ ముందు వరుసలో ఉందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నాగరి కత సూత్రాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ దేశంలో ఉందని వివరించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ యంగ్ సైంటిస్ట్ సదస్సులో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొని మాట్లాడారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఏఎన్ఆర్ఎఫ్ వంటి కార్యక్రమాలు అట్టడుగు వర్గాల ఆవిష్కరణలను పెంపొందించడానికి, పరిశోధనలకు ప్రోత్సాహాకా న్ని అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ అసుతోశ్ శర్మ, జీవైఏ కో చైర్మన్ ఎన్సీ ఫ్లోరీస్, ఐఐటీహెచ్ గవర్నింగ్ బాడీ చైర్మన్ డాక్టర్ బీవీ మోహన్రెడ్డి, ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్