
చేపలు పట్టేందుకు వెళ్లి మత్స్యకారుడు ..
కల్హేర్(నారాయణఖేడ్): చేపలు పట్టేందుకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజాంపేట్ మండలంలోని రాంరెడ్డిపేట్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గంగారాం(42) చేపలు పట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా గాలి వీచడంతో ప్రమాదవశాత్తు తెప్ప బోల్తా పడింది. దీంతో గంగారాం నీటిలో మునిగి చేపల వలలో చిక్కుకుని మృతి చెందాడు. వెంటనే వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం చెరువులో మృతదేహం కనిపించింది. కల్హేర్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశం తెలిపారు.